గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (15:16 IST)

రాజమహేంద్రవరం పెద్దపులి.. ప్రజల్లో భయం భయం.. పట్టుకునేందుకు అంతా రెడీ

Rajamahendravaram
Rajamahendravaram
గత నాలుగు రోజులుగా రాజమహేంద్రవరం శివార్లలో సంచరిస్తున్న ఒక పులి ఎనిమిదికి పైగా పశువులను చంపిందని, దీంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయని ఒక అటవీ అధికారి గురువారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రం గ్రామం సమీపంలోని అంకమ్మ తల్లి కొండ ఆలయం వద్ద ఈ పులి మొదటిసారిగా కనిపించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు ఎనిమిది పశువులను చంపిందని ఆయన చెప్పారు. 
 
గత నాలుగు రోజులుగా రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో తిరుగుతున్న ఒక పులి గురువారం నాలుగు పశువులను చంపిందని, ఇది స్థానిక నివాసితులలో భయాందోళనలు సృష్టిస్తోందని ఓ అధికారి తెలిపారు. గత 15 రోజులుగా ఈ పులి రాజమహేంద్రవరం, దివాన్ చెరువు ప్రాంతాలలో సంచరిస్తోందని చెప్పారు. 
 
గురువారం అది నాలుగు పశువులను చంపిందని అటవీశాఖాధికారులు చెప్పారు. పట్టణ - గ్రామీణ నివాసాల మధ్య ఉన్న తోటలు, వ్యవసాయ భూములలో ఆ జంతువు దాక్కుని ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ ప్రకారం, పులులు సాధారణంగా మహారాష్ట్రలోని తడోబా అడవి నుండి వలస వచ్చి, భూభాగం, ఆహారం కోసం అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. జనావాసాలు ఉన్న ప్రాంతాలలో, అటవీ సరిహద్దు ప్రాంతాలలో ఈ జంతువు సంచారం గమనించబడింది. 
 
ఇది గ్రామస్తులు, ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తోంది. ఆ పెద్ద పులిని పట్టుకోవడానికి పూణే నుండి ఒక బృందం ఇక్కడికి వచ్చింది. పులిని పట్టుకోవడానికి ఈ బృందాన్ని మోహరించారు. దాని కదలికలను పర్యవేక్షించడానికి కీలకమైన ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. 
 
రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ నివాసితులకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, ఆ జంతువును సురక్షితంగా పట్టుకోవడానికి లేదా తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.