గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (10:48 IST)

శ్రీకాకుళంలో విషాదం : స్నానానికెళ్లిన ఇద్దరు జలసమాధి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన ఒకటి జరిగింది. స్నానానికి ఇద్దరు యువతులు నేల బావిలో పడి జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని భామిని మండలం కోటకొండ గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గఈ కోటకొండ గ్రామానికి చెందిన పి.కీర్తికి (12), ఎ.అంజలి (13) శుక్రవారం స్నానం చేసేందుకు గ్రామంలోని ఓ బావి దగ్గరకు వెళ్లారు. అనంతరం స్నానానికి దిగి బావిలో పడి మరణించారు. 
 
అనంతరం గమనించిన గ్రామస్థులు బావిలోనుంచి బాలికల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. 
 
మృతిచెందిన బాలికలిద్దరూ స్నేహితులు. ఇద్దరు కూడా విజయనగరం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇద్దరూ గ్రామ శివార్లలోని నేల బావిలో స్నానానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.