1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayanagaram Woman Commits suicide following blackmail by married lover

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

Vijayanagaram Woman
Vijayanagaram Woman
ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడు. ప్రేమించానని గొంతు కోశాడు. ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి మిన్నకుండక ఆమెను బెదిరించాడు. వేధింపులకు గురిచేశాడు. చివరికి పెళ్లికి ముందు ఇలా ప్రియుడి చేతిలో వేధింపులకు గురికావడం కంటే.. అతడి బ్లాక్ మెయిల్‌కు తలొగ్గడం కంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడమే బెటర్ అనుకుంది ఓ మహిళ. అంతే పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. కన్నవారి పరువు కోసం పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా తోండ్రంగి గ్రామంలో వెలుగుచూసింది. 
 
తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22) డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ, అనారోగ్యంతో ఉన్న తండ్రి, తల్లి, చెల్లికి ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి అయిన రామునాయుడు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల అఖిలకు వేరొక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు ఆమె కుటుంబీకులు. 
 
జూలై 2న (గురువారం) నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేశారు. అంతే ఈ విషయం తెలుసుకున్న రామునాయుడు అఖిలను వేధించాడు. పురుగుల మందు ఇచ్చి చావమన్నాడు. అలా చేయకపోతే.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మన విషయం చెప్పి సంబంధం చెడగొడతానని బెదిరించాడు. 
 
దీంతో అఖిల జూన్ 30న పురుగుమందు తాగింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మరణానికి ముందు యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి