సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై కన్నడ ప్రజలకు మంచి నమ్మకం ఉండబట్టే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై సీఎం కిరణ్ స్పందిస్తూ సోనియా, రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉంచి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా ఓటేసిన ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.