దేశీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 31 పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ టూరిస్ట్ సెంటర్ల ద్వారా లెక్కకుమించి పర్యాటకులు రాష్ట్రంలో సందర్శించగలరని భావిస్తున్నారు.