దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే శ్రీ నరసింహ సరస్వతీ స్వామి ఎన్నో సంవత్సరాలుగా తపస్సుచేసి అక్కల్ కోట మహరాజ్గా పేరుగాంచారు. ఈ మహానుభావుడు తపస్సు చేసిన చోటే కదళీవనంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీశైలానికి దగ్గర్లో ఉండే ఈ ప్రాంతంలో సరస్వతీ స్వామివారు తపస్సు చేసి, ఆ తరువాత తన తపశ్శక్తినంతటినీ షిర్డీ సాయిబాబాకి ధారపోశారని స్థానికుల విశ్వాసం.