ఇక్కడ అడుగుపెట్టగానే శిల్పాలు నాట్యం చేస్తున్నట్లుగా.. శిలలు సప్త స్వరాలను ఆలాపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి, విశాలమైన సరస్సు, ఆ సరస్సు ఒడ్డున విలసిల్లుతున్న ఈ అద్భుత కళాఖండాన్ని చూడగానే రస హృదయాలు పరవశించిపోతాయి. ఇంతటి అపురూప రమణీయ శిల్ప కళాఖండం.. కాకతీయుల రాజధాని వరంగల్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలోని రామప్పలో విరాజిల్లుతోంది.