విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో చంద్రగిరి స్వర్ణయుగ వైభవంతో అలరారింది. రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చెబుతుంటారు. ఆనాటి వైభవాన్ని చాటుతూ ఠీవిగా నిలుచున్న శత్రుదుర్భేద్యమైన చంద్రగిరి కోట చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీప దూరంలో ఉన్న చంద్రగిరి వద్ద నిర్మితమైన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.