వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గం. వెలమ రాజులు శుత్రుదుర్భేద్యంగా నిర్మించిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో మల్లేపల్లి నుంచి ఏడుకిలోమీటర్ల దూరం లోపలికి వెళితే స్వాగతం పలుకుతుంది.