మధ్య ప్రదేశ్ను పాలించిన సింధియా రాజుల వేసివి విడిది కేంద్రం శివపురి. పచ్చని అడవులతో అలరారే ప్రాంతం శివపురి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఏనుగులను లొంగదీసుకున్న ప్రాంతం కూడా ఇదే. శివపురిలో ప్రస్తుతం పులుల సంరక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు.