ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ పెన్నా శివరామకృష్ణల సంపాదకత్వంలో వెలువడిన 'కవితా దశాబ్ది' సంకలనంలో వైవిధ్యంతో కూడిన కవితలు చోటు చేసుకున్నాయి. వీటి నేపధ్యం విషయానికి వస్తే.. భారత దేశంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది.