గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత స్టేట్ బ్యాంకు రూ.2742 కోట్ల నికర ఆదాయం సాధించింది. ఇది గత యేడాదితో పోల్చితే 46 శాతం అధికమని ఆ బ్యాంకు ప్రకటించింది. వడ్డీలపై అధిక ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు పెరగటంతో నికర లాభంలో పెరుగుదల నమోదు చేసుకున్నట్లు బ్యాంకు పేర్కొంది.