సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకుగానూ హైదరాబాద్కు చెందిన ఐదు ఎన్జీవో సంస్థలతో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఐబీఎం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐబీఎంకు చెందిన ఉద్యోగులు ఈ ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తారని ఐబీఎం ఇండియా డైరెక్టర్ రమేష్ నరసింహన్, కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ మమతా శర్మ వెల్లడించారు.