1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. ICC T20 Women-s World Cup: Smriti Mandhana hammered the Pakistani bowlers; a massive victory

Smriti Mandhana, పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టిన స్మృతి మంధన, భారీ విజయం

Smriti Mandhana
Smriti Mandhana ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎడ్జెబ్‌స్టన్‌లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా బ్యాట్సమన్లు దూకుడుగా ఆడారు. స్మృతి మంధన కేవలం 44 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టి 68 పరుగుల భారీ పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు ముందు భారీ లక్ష్యం వుంచగలిగినట్లయ్యింది. షెఫాలీ వర్మ 6 పరుగులకే ఔటయ్యింది. జెమీయ 1 పరుగు, హర్మన్ ప్రీత్ 36 పరుగులు, భర్తి 1, రిచా ఘోష్ 34, దీప్తి 12, శ్రేయాంక 1 పరుగు చేసారు. 20 ఓవర్లకు భారత్ 170 పరుగులు చేసింది. 
 
ఈ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు తొలుత ఒకింత కట్టుదిట్టంగా ఆడినా వరుస వికెట్లు కోల్పోవడంతో పరాజయం పాలైంది. మునీబా 41, ఫిరోజా 12, అయేషా 12, సైరా 2, నతాలియా 7, ఫాతిమా 0, అలియా 18, రమీమ్ 4, నశ్రా 4, తస్మియా 0, సాదియా 1 పరుగులు చేసారు. 17 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. కేవలం 106 పరుగులు చేసారు. 

About Writer
ఐవీఆర్