సంబంధిత వార్తలు
- అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?
- ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం
- దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా?: సజ్జనార్ ఆగ్రహం
- Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?
- వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి
గదిలో భర్తతో పాకిస్థాన్ సీనియర్ మహిళా క్రికెటర్ - పాక్ మహిళా క్రికెట్ జట్టులో రచ్చ
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు మరోమారు వెలుగు చూశాయి. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుసగా ఓడిపోతోంది. దీంతో ఆ జట్టులో అంతర్గత విభేదాలతో పాటు గొడవలు తారాస్థాయికి చేరినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ - కోచ్ మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఈ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు జట్టులోని గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.
జట్టు మెంటార్ వహాబ్ రియాజ్కు, కెప్టెన్ ఫాతిమా సనాకు మధ్య సెలక్షన్ విషయాల్లో తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తిన్నట్లు సమాచారం. బంగ్లాదేశీ మ్యాచ్కు ముందు ఈ వివాదం మరింత ముదిరింది. సీనియర్ ప్లేయర్ ఆలియా రియాజ్ భర్త, ఆమెతో పాటు టీమ్ హోటల్ గదిలో ఉండటాన్ని కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పట్టుబట్టడంతో ఆలియా భర్త అలీ యూనిస్ను గది ఖాళీ చేయమని యాజమాన్యం కోరింది. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్కు ముందు, జట్టు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆలియా, ఆమె భర్త సరదాగా షికారుకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది.
దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆలియాను బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి తప్పించాలని ఫాతిమా పట్టుబట్టింది. అయితే, మెంటార్ వహాబ్ రియాజ్ మాత్రం ఆమెను తుది జట్టులో కొనసాగించాలని పట్టుబట్టారు. చివరికి వహాబ్ మాటే నెగ్గింది. కానీ, ఆ మ్యాచ్లో ఆలియా విఫలమవగా, పాకిస్థాన్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం అందరి ముందే ఫాతిమా సనా.. వహాబ్ను నిలదీసింది. క్రమశిక్షణ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఓటమి ఎదురైందని, దీనికి మీరే బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
