Poonam Pandey: బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు కానీ.. పూనమ్ పాండే ఛాన్స్ ఇస్తే ఆ పని చేసేదే..!
బాలీవుడ్ చిత్రాలలో నటించిన పూనమ్ పాండే 2011 ప్రపంచకప్ సందర్భంగా ఒక విచిత్రమైన వాగ్దానం చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ 2011 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచి 1983 చరిత్రను పునరావృతం చేసింది.భారత్ ఈ ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంటే, తాను వేలాది మంది ముందు బట్టలు విప్పి తిరుగుతానని ఆమె చెప్పింది.
బీసీసీఐ అనుమతి ఇస్తే ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్లో కూడా అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఎందుకంటే బీసీసీఐ ఈ రకమైన చర్యకు బాలీవుడ్ నటికి అనుమతి ఇవ్వలేదు.
కాగా.. 2011లో బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన క్రికెట్ పిచ్చిని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ ప్రపంచకప్ గెలిస్తే తాను బట్టలు లేకుండా స్టేడియంలో తిరుగుతానని, బీసీసీఐ అనుమతిస్తే డ్రెస్సింగ్ రూంలోకి కూడా వెళ్లగలనని ఆమె ప్రకటించింది.