ధోనీ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer
ఇప్పటి వరకు ఈ రికార్డు బహామాస్కు చెందిన కెప్టెన్ గ్రెగరీ టేలర్ పేరిట ఉండేది. ఆయన వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్ల్లో టాస్ గెలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆ రికార్డును అధిగమించి వరుసగా ఎనిమిది టాస్లు గెలిచిన తొలి కెప్టెన్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ వ్యక్తిగతంగా అరుదైన రికార్డు సాధించినా, జట్టు ప్రదర్శనను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారతీయ కెప్టెన్ల విషయానికొస్తే, టీ-20లలో వరుసగా అత్యధిక సార్లు టాస్ గెలిచిన రికార్డు గతంలో ఎం.ఎస్. ధోనీ పేరిట ఉండేది. ధోనీ 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య భారత టీ20 కెప్టెన్గా వరుసగా ఏడు సార్లు టాస్ గెలిచారు. ఈ విజయం తర్వాత, జట్టు ప్రదర్శనను అయ్యర్ ప్రశంసించారు; కెప్టెన్గా తన తొలి విజయాన్ని నమోదు చేయడం ఒక ప్రత్యేకమైన క్షణమని ఆయన పేర్కొన్నారు.
