బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 జనవరి 2016 (11:29 IST)

మహేంద్ర సింగ్ ధోనీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది: అజారుద్ధీన్

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ప్రస్తుతం పెద్ద చర్చ సాగుతోంది. జట్టుకు వరుసగా పరాజయాలు, వ్యక్తిగతంగా విఫలమవుతున్న నేపథ్యంలో ధోనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టెస్టు కెరీర్ ను ముగించిన అతడు త్వరలోనే మిగిలిన రెండు ఫార్మాట్లకూ వీడ్కోలు పలకక తప్పదన్న వాదన వినిపించింది. 
 
అయితే శుక్రవారం మెల్ బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 27 పరుగుల విక్టరీతో సిరీస్ కైవసం చేసుకున్న ధోనీకి లైఫ్ లైన్ చిక్కేసిందట. ఈ మేరకు టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. 
 
గడిచిన రెండు మ్యాచ్‌‍ల్లో ధోనీ కొత్త ఉత్సాహంతో కనిపించాడని అజారుద్దీన్ కితాబిచ్చాడు. జట్టు విజయాలు అతడి మోములో కొత్త ఉత్తేజాన్ని నింపాయని అజారుద్ధీన్ అన్నాడు. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న దోనీ... ఇక మరింత కాలం పాటు క్రికెట్ ఆడతాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని అజర్ తెలిపాడు.