ఛాంపియన్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడిన అమిత్ మిశ్రా ఇకపై జాగ్రత్తగా మసలుకోవాలని అంపైర్లు హెచ్చరించారు. విక్టోరియా ఓపెనర్ రాబ్ కువినిని బోల్డ్ చేసిన మిశ్రా పెవిలియన్ వైపు వెళ్లాల్సిందిగా.. ఆక్రోశంతో చేయెత్తిచూపాడు. దీంతో అంపైర్ అయిన రోషాన్ డేర్ డెవిల్స్ ఆటగాడు మిశ్రాను హెచ్చరించారు.