బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డే/నైట్ టెస్ట్ మ్యాచ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా డే/నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు బీసీబీ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.