గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 డిశెంబరు 2014 (12:07 IST)

రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణం.. ధోనీ తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యాడు..!

భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించిన ధోనీ కూల్ కెప్టెన్‌గా అందరి వద్ద ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి కూల్ కెప్టెనే తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యాడు. తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మరుక్షణం భారత జట్టు డ్రెసింగ్ రూంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.

ఆ ప్రకటన చేసిన తర్వాత జట్టు సహచరులు అతన్ని ఆలింగనాలతో హత్తుకున్నారు. తనితో కలిసి ఫొటోలు తీయించుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో ధోనీ కాస్తా ఉద్వేగానికి లోనైనట్లు తనకు ఎవరో చెప్పారని బిసిసిఐ కార్యదర్సి సంజయ్ పటేల్ అన్నారు.

జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి ధోనీ రిటైర్మెంట్ ప్రకటన గురించి వైబ్‌సైట్లో రాశాడు. అతను డ్రెసింగ్ రూంకు వెళ్లేప్పుడు జట్టు సభ్యులందరినీ వెంట తీసుకుని వెళ్లాడు. ఏ విధమైన స్వప్నాలూ లేవని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లలో తాను ఆడలేనని, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ధోనీ చెప్పాడు. చివరి వరకు ధోనీ నిజాయితీగా ఉన్నాడని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 
 
అన్ని ఫార్మాట్లూ ఆడలేనని తన జట్టుతో చెప్పే తెగువ ధోనీకి మాత్రమే ఉందని, తన పట్ల తన జట్టు సభ్యుల పట్ల అతను ఎంత నిజాయితీగా ఉన్నాడో ఈ ఘటన తెలియజేస్తుందని పొగిడాడు.