గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 31 డిశెంబరు 2014 (10:57 IST)

డ్రెస్సింగ్‌ రూంలో భావోద్వేగానికి గురైన ధోనీ : బీసీసీఐ

టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని జట్టు సహచరులకు చెప్పేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమైనపుడు ధోనీ భావోద్వేగానికి గురయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది.
 
ఇదే అంశంపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసిందన్నారు. ధోనీ ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసిందన్నారు.
 
మెల్‌బోర్న్ టెస్టు ముగిసిన వెంటనే డ్రెస్సింగ్ రూంలో ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కాస్త ఎమోషనల్‌గా ఫీలైనట్టు తెలిసిందని తెలిపాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన చేయగానే, సహచరులందరూ ధోనీని హత్తుకుని విషెస్ చెప్పడంతోపాటు అతనితో ఫొటోలు తీసుకున్నారని తెలిపారు.
 
కాగా, 2015లో జరిగే ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి ధోనీ తప్పుకుంటాడనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం అటు క్రికెట్ ప్రపంచంతో పాటు ఇటు బీసీసీఐని కూడా ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే.