శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (15:25 IST)

ప్రియమైన భారత అభిమానుల్లారా.. పిల్లలూ క్రీడల్లోకి రావొద్దు..

ఆదివారం లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో బ్రిటీష్ జట్టు కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ ఆటగాడు జేమ్స్‌ నీషమ్ ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 
 
ఈ పోస్టులో పిల్లలు ఎవరూ క్రీడల్లోకి రావొద్దని పిలుపునిచ్చాడు. అంతేగాకుండా పిల్లలు ఏదైనా మంచి వృత్తిని ఎంచుకోండి.. అంటూ జిమ్మీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నీషమ్ పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల తమదైన స్టైల్‌లో కామెంట్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు కూడా నీషమ్‌ను ఓదార్చుతున్నారు. ఫైనల్ మ్యాచ్ ముందురోజు కూడా నీషమ్ ఓ పోస్ట్ చేశాడు.
 
ప్రియమైన భారత అభిమానులారా.. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండని ట్విట్టర్‌లో చెప్పాడు.