ప్రేమించి పెళ్లి చేసుకున్న చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపేశారు...
తెలంగాణ రాష్ట్రంలో తమ చెల్లిని వేధిస్తున్న బావను బామ్మర్ధులు చంపేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన చెల్లిని వేధించడాన్ని జీర్ణించుకోలేని బావమరుదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కుమ్మర్వాడీకి చెందిన షేక్ మెహబూబ్ (26) అలియాస్ గోల్కొండ చాందీ మసూద్ ఎలక్ట్రీషియన్తో పాటు యూట్యూబర్గా కొనసాగుతున్నాడు. 2025 జనవరిలో అదేప్రాంతానికి చెందిన రుక్సా(22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లైన ఆరునెలల వరకు సంసారం సాఫీగా సాగింది. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
సోమవారం రుక్సా సోదరుడు సొహేల్ ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం సొహేల్ అతని కజిన్ జాబేర్తో కలిసి మెహబూబ్ ఇంట్లో ఉండగా అతని తలపై రాడ్తో దాడి చేసి కత్తితో పొడిచారు. దీంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
