సంబంధిత వార్తలు
- సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు
- హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త
- మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?
- అడగ్గానే ఫ్రిజ్లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...
- కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి
తల్లి క్షణికావేశం - పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు...
ఓ తల్లి క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయంతో రెండు ప్రాణాలు పోయాయి. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
వెంకటగిరి పట్టణంలోని ఆత్మామాలిక్ ధ్యాన మందిరంలో నాగేశ్వర శర్మ పండితుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య లీలాబాలశ్రావణి (35), కుమారుడు చంద్రమౌళి (9), ఓ కుమార్తె (7) ఉన్నారు. లీలాబాలశ్రావణి సోమవారం సాయంత్రం కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొని కాశీతోటలోని శివాలయం వద్దకు చేరుకున్నారు.
నిర్మానుష్య ప్రాంతంలో తనతో పాటు కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించుకుంది. మంట వేడి తాళలేక చంద్రమౌళి కేకలు వేస్తూ.. తుప్పల్లో పరుగులు తీశాడు. సమీపంలోని ఆటో డ్రైవర్లు గమనించి ఆరా తీయగా.. తన తండ్రి సెల్ఫోన్ నంబరు ఇచ్చి సమాచారం తెలియజేయాలని కోరాడు. విషయం తెలుసుకున్న నాగేశ్వరశర్మ అక్కడి చేరుకున్నారు.
భార్య చనిపోయి ఉండటంతో చేసేది లేక కుమారుడిని తీసుకొని తిరుపతి బయలుదేరాడు. సగం దూరం వెళ్లేసరికి బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ బయటకు వచ్చిన సమయంలో కుమార్తె ఆడుకోవడానికి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
