బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (15:46 IST)

దంత సిరి : చెన్నై బాలుడి దవడలో 526 దంతాలు

సాధారణంగా ప్రతి వ్యక్తికి 32 పళ్లు ఉంటాయి. అందుకే ఎవరికైనా కోపం వస్తే కొడితే 32 పళ్లు రాలిపోతాయని అంటుంటారు. కానీ, ఆ బాలుడుకు మాత్రం ఏకంగా 526 దంతాలు ఉన్నాయి. దీంతో ఆ దంతాలను ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. చెన్నైలో వెలుగు చూసిన ఈ దంత సిరి ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నైకు చెందిన ఏడేళ్ళ బాలుడు రవీంద్రనాథ్. ఈ బాలుడుకు పదేపదే దవడ నొప్పి వస్తూ ఉండేది. ఇటీవల తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటంతో నగర శివారు ప్రాంతంలో ఉన్న సవిత దంత వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలుడికి వివిధ పరీక్షలు చేసిన వైద్యులు... కింది దవడ కుడిభాగంలో సంచిలాంటి నిర్మాణం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 
 
వీటిని తొలగించాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందేనంటూ వైద్యులు స్పష్టంచేశారు. ఆ తర్వాత ఆ బాలుడు తల్లిదండ్రుల అనుమతి మేరకు ఐదుగురు దంత వైద్యులు, ఏడుగురు పాథాలజిస్టులు, ఇతర సహాయక సిబ్బంది కలిసి మొత్తం ఐదు గంటల పాటు శ్రమించి అదనంగా ఉన్న దంతాలను తొలగించారు. 
 
ఆ తొలగించిన దంతాలను లెక్కించగా అవి 526గా ఉన్నాయి. ఈ దంతాలను చూసిన వైద్యులు.. కేవలం వైద్యులే కాదు బాలుడు కూడా ఆశ్చర్యపోయారు. గతంలో ముంబైకు చెందిన ఓ యుక్తవయసు బాలుడుకి 232 దంతాలున్న విషయాన్ని వైద్యులు గుర్తించిన విషయం తెల్సిందే.