సంబంధిత వార్తలు
- 35మంది ఉగ్రవాదులను హతమార్చిన పాకిస్తాన్ భద్రతా దళాలు
- మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్
- తప్పు చేయకపోయినా నిర్బంధమే - అరెస్టులే ... బలూచిస్థాన్ ప్రజలపై పాక్ ఉక్కుపాదం
- భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!
- వైట్హౌస్ సమీపంలో కాల్పులు.. చంపేసిన సీక్రెట్ సర్వీస్ అధికారుల
బలూచిస్థాన్లో రక్తపాతం - పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి..
పాకిస్థాన్లో ఘోర ఉగ్ర దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయాగు, మరో 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో సైనికులు కూడా ఉన్నట్టు సమాచారం.
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఆదివారం ఈ దాడి జరిగింది. క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న ఈ రైలులో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న బక్రీద్ పండుగ కోసం వీరంతా తమ స్వస్థాలకు వెళుతుండగా ఈ దారుణం జరిగింది. రైలులో క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద సిగ్నల్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నింపిన కారుతో ఒక బోగీని ఉగ్రవాదులు ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
ఈ పేలుడు తీవ్రతకు రైలు బోగీ నుజ్జునుజ్జయి పక్కకు ఒరిగిపోయింది. పలు కోచ్లు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
విస్తీర్ణంలో పాకిస్థాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం బలూచిస్థాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఈ ప్రావిన్స్లోని సహజ వనవరులను కేంద్రం ప్రభుత్వం దోచుకుంటుందని స్థానిక ప్రజలకు ప్రయోజనాలు కల్పించడం లేదని బలూచ్ వేర్పాటువాద గ్రూపులు కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి.
