1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 40 killed after bus falls into ravine in Pakistan's Khyber Pakhtunkhwa

పాకిస్థాన్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 40 మంది మృత్యువాత

bus crash
పాకిస్థాన్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మహిళలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున బలోచిస్థాన్-ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల సరిహద్దులోని దారాసర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు.
 
ప్రమాదానికి గురైన బస్సు క్వెట్టా నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో మరో బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారని షాహిద్ తెలిపారు. సామర్థ్యానికి మించి బస్సు ప్రయాణిస్తుండటంతో అదుపుతప్పి లోయలోకి పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. 
 
బ్రిటీష్ మహిళ మెదడులో పర్నాజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం 
 
ఎపుడో రెండున్నర దశాబ్దాల క్రితం భారత్‌లో పర్యటించి స్వదేశానికి వెళ్లిన ఓ బ్రిటీష్ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీనికి కారణం ఆమె మెదడులో పరాన్నా జీవులు చేరడమే. భారత్‌లో ఆరగించిన, తాగిన కలుషిత ఆహారం, నీటిని సేవించడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్టు వైద్యపరీక్షల్లో తేలింది. ఫలితంగా గత పదేళ్ళుగా ఆమె నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. భారత పర్యటనలో ఉన్నపుడు ఆమె శరీరంలోకి ప్రవేశించిన ఒక పరాన్నజీవి కారణంగా మెదడులో ఏకంగా 38 పరాన్న జీవులు అభివృద్ధి చెంది, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
 
వేల్స్‌కు చెందిన 42 ఏళ్ల లోరీ డెన్ మన్, 2007లో భారత్లో రెండు నెలల పాటు పర్యటించారు. ఆమె శాఖాహారి అయినప్పటికీ, కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా 'టీనియా సోలియం' అనే పరాన్నజీవి లార్వా ఆమె శరీరంలోకి ప్రవేశించింది. దీనివల్ల ఆమె 'న్యూరోసిస్టోసెర్కోసిస్' అనే అరుదైన ఇన్ఫెక్షన్ ఆమె బారిన పడ్డారు.
 
పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత, 2010లో ఒక రెస్టారెంట్ టాయిలెట్‌లో ఆమె శరీరం నుంచి సుమారు మీటరు పొడవున్న టేప్ వార్మ్ (బద్దె పురుగు) బయటకు వచ్చింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ, అప్పట్లో అంతా సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఏడాది తిరిగేసరికి తీవ్రమైన తలనొప్పి, సంభాషించడంలో ఇబ్బందులు, మూర్ఛ వంటి తీవ్ర లక్షణాలు మొదలయ్యాయి.
 
స్కానింగ్ నిర్వహించగా ఆమె మెదడులో 38 పరాన్నజీవులు ఉన్నట్లు తేలడంతో వైద్యులు, కుటుంబం సభ్యులు విస్మయానికి గురయ్యారు. దాదాపు పదేళ్ల పాటు యాంటీ-పారాసైటిక్ మందులు, స్టెరాయిడ్స్‌తో చికిత్స పొందినప్పటికీ పదేపదే మూర్ఛరావడం, గందరగోళం, తీవ్ర ఆందోళన, సైకోసిస్ వంటి మానసిక సమస్యలతో ఆమె పోరాడారు. ఒకానొక దశలో ఆమె తన తండ్రి ఇంట్లో చిన్నపిల్లలా నేలపై పాకడం, దాక్కోవడం వంటివి చేసేవారని ఆమె స్నేహితురాలు గుర్తుచేసుకున్నారు.
 
ఎట్టకేలకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే వైద్యంతో ఆ పరాన్నజీవులు నిర్వీర్యమై క్యాల్సిఫై అయ్యాయి. 2017 నుంచి తనకు మూర్ఛ రాలేదని, అయితే ఇప్పటికీ ప్రతిరోజూ మందులు వాడుతున్నానని లోరీ వెల్లడించారు. ఈ భయానక అనుభవం తన జీవితాన్ని తలకిందులు చేసిందని, తన మీడియా కెరీర్‌‍ను కూడా వదులుకోవాల్సి వచ్చిందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. మదర్సా టీచర్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష