తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాతంగానే ఉంటుంది : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు గట్టి హెచ్చరిక చేశారు. తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాంతంగానే ఉంటుందంటూ ఏఐ ఫోటోతో ఆయన ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించడంపై ట్రంప్ తన యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు చేయడం గమనార్హం.
కృత్రిమమేథతో రూపొందించిన ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకలు ప్రయాణిస్తున్నాయి. అక్కడే ట్రంప్, ఆయన పక్కన ఒక యూఎస్ నేవీ అడ్మిరల్ నిలబడి ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న నౌకలపై ఇరాన్ జెండాలు ఉండటం గమనర్హం. దీనికి తుఫానుకు ముందు ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు.
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. హర్మూజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో దాడులు పునఃప్రారంభించడంపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఆయన ఈ ఫొటో పంచుకోవడం ఆందోళనలను పెంచుతోంది.
