ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్.. గేర్ విరిగి చక్రం విడిపోయింది.. తర్వాత? (video)
థాయిలాండ్లోని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానం రన్వేపైకి దిగగానే నోస్ గేర్ విరిగిపోయి ముందు చక్రం విడిపోయింది. విమానం హైదరాబాద్ నుండి ఫుకెట్కు వెళుతుండగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
థాయ్ మీడియా ప్రకారం.., ఈ సంఘటన తర్వాత రన్వేను కొంతకాలం మూసివేయాల్సి వచ్చింది. అయితే, విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. వారికి ఎటువంటి గాయాలు ఏర్పడలేదు.
విమానం షెడ్యూల్ కంటే ముందే ఫుకెట్కు చేరుకుంది. విమానం ల్యాండింగ్ సమయం ఉదయం 11:40, కానీ అది ఉదయం 11:24 గంటలకు ల్యాండ్ అయింది. విమానం చాలా త్వరగా ల్యాండ్ అయిందని, ముందు ల్యాండింగ్ గేర్ పాడైందని అధికారులు తెలిపారు. చక్రం విడిపోవడం వల్ల విమానాన్ని వెంటనే రన్వే నుండి తొలగించలేకపోయారు.