నన్ను టచ్ చేస్తే భూమ్మీద నామరూపాలు లేకుండా పోతారు: ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రోజురోజుకీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ లీడర్ అయాతుల్లా అలీ ఒంటెద్దు పోకడకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ పిలుపునివ్వడంపై ఇరాన్ సైనికాధికారి స్పందిస్తూ... తమ నాయకుడిపై దాడి చేసేవారి చేతులు నరికేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు... తమ నాయకుడికి ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ... మీరు నన్ను చంపుతారా? పొరబాటున ఆ పని చేసారంటూ ఇక మీరు ఈ భూమ్మీద వుండరు. నాపై ఎలాంటి దాడి జరిగినా, దాని వెనుక ఒకవేళ ఇరాన్ వుంటే, ఆ దేశాన్ని భూమండలం పైనుంచి పూర్తిగా తుడిచి పెట్టేయమని నేను మా అధికారులకు ముందుగానే సూచించాను. కనుక నాకేమీ భయంలేదు. టచ్ చేస్తే మాడిమసైపోయేది మీరే అంటూ తీవ్ర హెచ్చరికలు చేసారు.