సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మార్చి 2026 (10:31 IST)

హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, చమురు చిక్కుల్లో భారత్?

Iran closes Strait of Hormuz
తమపై ఎలాంటి దాడులు జరిగినా ఇరాన్ చేసే మొట్టమొదటి పని హర్ముజ్ జలసంధిని మూసివేయడం. ఎందుకంటే ఈ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో 20 శాతం మేర నౌకల ద్వారా సరఫరా అవుతుంది. మరీముఖ్యంగా భారతదేశానికి అత్యధికంగా ఈ మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుంచి చమురు, ఎల్ఎన్జి సరఫరా అవుతుంటాయి. అట్లాంటి ప్రధానమైన రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
 
ఆ మార్గం ద్వారా ఏవైనా నౌకలు వెళ్లే ప్రయత్నం చేస్తే తమ నౌకాదళ సిబ్బంది, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వాటికి నిప్పు పెడతారని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తాజా ప్రకటనతో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవలసిన పరిస్థితులు తలెత్తనున్నాయి. ఐతే చైనా, జపాన్, దక్షిణ కొరియా తమతమ దేశాల్లో ఇప్పటికే భారీగా చమురును నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు.
 
ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసినప్పటికీ జపాన్ వద్ద కనీసం ఏడాదికి సరిపడా నిల్వలున్నట్లు సమాచారం. అలాగే చైనా కూడా భారీగా నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర కొరియా వద్ద 200 రోజులకు పైగా సరిపడా చమురు నిల్వలు వున్నట్లు సమాచారం. మన దేశం పరిస్థితి చూస్తే.. ఇంధన మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 74 రోజులు వరకూ ఎలాంటి ఇబ్బంది వుండదని చెబుతున్నారు. మరి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎన్నాళ్లకు ముగుస్తుందో చూడాల్సి వుంది. ఇదిలావుంటే భారతదేశం తన చమురు అవసరాలకు ఏమేమి చేయాలన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు భోగట్టా.