గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (09:59 IST)

భారత్‌పై విరుచుకుపడిన బంగ్లాదేశ్ ప్రధాని కేపీ శర్మ.. ఏమన్నారు?

భారత్‌పై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కేపీ శర్మ మండిపడ్డారు. నేపాల్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఇండియా ప్రస్తావించడాన్ని కేపీ శర్మ తప్పుబట్టారు. కొద్ది రోజుల క్రితం నేపాల్‌పై తమ శక్తిని ప్రదర్శిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడాన్ని పేరు చెప్పకుండా ప్రస్తావించిన కేపీ శర్మ.. పొరుగు దేశమైన భారత్‌ చర్యలు సరైనవి కావన్నారు. 
 
దశాబ్దపు కాలం నాటి ఓ పాత విషయాన్ని భారత్ ప్రస్తుతం తవ్వుతోందని దుయ్యబట్టారు. గతంలో తమ దేశం యుద్ధం చేసిందని, అన్ని సమయాల్లో అది పనికిరాదని, ఇప్పుడు తాము శాంతి మార్గంలో వెళుతున్నామని ఆయన తెలిపారు.