1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pakistan ranks first on Global Terrorism Index with 6 percent rise in deaths

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్

inida vs pakistan
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద మరణాలు, దాడుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ క్రమలో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది. గత యేడాది అక్కడ ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ఏకంగా 1139 మంది ప్రాణాలు కోల్పోయినట్టు శనివారం విడుదలైన ఓ నివేదికలో వెల్లడించింది. 
 
మొరాకోకు చెందిన జర్నలిస్ట్, పరిశోధకురాలు ఫాతిమా ఎల్ హషిమి 'అమెరికన్ థింకర్' అనే ఆన్‌లైన్ మ్యాగజైన్‌లో ఈ విషయంపై విశ్లేషించారు. పాకిస్థాన్‌లో హింస ఒక సాధారణ విషయంగా మారిపోయిందని, ఇది దేశ భద్రతా వ్యవస్థ తీవ్రంగా క్షీణిస్తోందనడానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
పాక్‌లో ఉగ్రవాదం పెరగడం ఇది వరుసగా ఆరో ఏడాది అని ఆమె గుర్తుచేశారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు. 2025లో జరిగిన దాడుల్లో 74 శాతానికి పైగా, మరణాల్లో 67 శాతం ఖైబర్‌ఫఖ్తుంక్వా , బలూచిస్థాన్ ప్రావిన్సులలోనే నమోదయ్యాయని ఫాతిమా వివరించారు. ఈ ప్రాంతాల్లో పాలన, అభివృద్ధి లేకపోవడం వల్లే అంతర్గత సంఘర్షణలకు కేంద్రంగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు.
 
పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక వ్యూహం కేవలం సైనిక చర్యలకే పరిమితమైందని, పాలనాపరమైన సంస్కరణలు, తీవ్రవాదాన్ని నిరోధించే ఇతర చర్యలు బలహీనంగా ఉన్నాయని ఫాతిమా విమర్శించారు. కేవలం సైనిక బలంతో కాకుండా రాజకీయ స్పష్టత, సమర్థవంతమైన పాలన, పొరుగు దేశాలతో (ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్) సత్సంబంధాలు వంటి చర్యలు చేపడితేనే పాకిస్థాన్‌లో శాంతి నెలకొంటుందని ఆమె స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్