సంబంధిత వార్తలు
- బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం
- ప్రశ్న రావణ్కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి
- సీమాంతర ఉగ్రవాదంతో తీవ్రంగా నష్టపోతున్న భారత్
- వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య
- పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్
11 యేళ్ల బాలుడి నిర్లక్ష్యం - 8 మంది సన్యాసులు దుర్మరణం (Video)
థాయ్లాండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 11 యేళ్ల బాలుడి నిర్లక్ష్యాన్ని ఏకంగా ఎనిమిది మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన థాయ్లాండ్లోని ముక్దహాన్ అనే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే వళ్లు గగుర్పాటుకు గురవుతుంది.
11 యేళ్ళ చిన్నబాలుడు తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పికప్ ట్రక్కు వాహనాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. అయితే, డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోవడంతో ఆ వాహనం రోడ్డు పక్కన కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర (తీర్థయాత్ర) చేస్తున్న బౌద్ధ సన్యాసుల గ్రూపుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ 35 మంది సన్యాసులు, వారితో పాటు ఐదుగురు అనుచరులు ఉన్నారు. వీరిలో అనేక మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థాయ్లాండ్లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడి నిర్లక్ష్యానికి 8 మంది సన్యాసులు బలి..
— RTV (@RTVnewsnetwork) July 2, 2026
థాయ్లాండ్లోని ముక్దహాన్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన..
11 ఏళ్ల ఒక చిన్న బాలుడు తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పికప్ ట్రక్కును (వాహనాన్ని) తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు.
అయితే, డ్రైవింగ్పై… pic.twitter.com/uiUXMr10ff
