సంబంధిత వార్తలు
- దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది : ఇరాన్ వార్నింగ్
- పాక్షికంగా తెరిచిన ఇరాన్ గగనతలం- హార్ముజ్ బంద్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- విధ్వంసం చాలా సులభం, నిర్మించడం చాలా కష్టం: ట్రంప్ పైన విరుచుకపడ్డ పోప్
- మాకు కావాల్సిందల్లా అదొక్కట్టే.. శాంతి చర్చలు.. పాకిస్థాన్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్
- శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్
ట్రంప్ తట్ట తగలేస్తారేమోనన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. తట్ట తగలేయడం అంటే మళ్లీ యుద్ధానికి సిద్ధమని చెప్పడమే. బుధవారం నాటితో ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. నేడు మరోసారి ఇరు దేశాల నేతలతో శాంతి చర్చలు జరపాలని పాకిస్తాన్ పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ దేశాన్ని అటు ఇరాన్, ఇటు అమెరికా నమ్మడం లేదు. పాకిస్తాన్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ వ్యవహారాన్ని ఎగదోస్తోందన్న అనుమానాలు రెండు దేశాలకు వున్నాయి.
అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వంపై ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు నేరుగా తనే పూనుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. నేరుగా ఇస్లామాబాద్ వచ్చి ముఖాముఖి చర్చలు చేసి తేల్చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ అందుకు ఇరాన్ అంగీకరించకపోతే వర్చువల్ డిస్కషన్స్ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం.
ఈ రెండింటిలోనూ ఇరాన్ తన వైఖరి మార్చుకోకుండా అలాగే మొండిపట్టు పడితే మాత్రం ఇక ఉపేక్షించేది లేదనీ, తమ బలగాలు ఇరాన్ దేశంపై బాంబులు వర్షం కురిపిస్తాయని వార్నింగ్ ఇచ్చారు. అదే కావాలని ట్రంప్ కోరుకుంటే తాము అందుకు సిద్ధమేనంటూ ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా బదులిస్తోంది. ఈసారి యుద్ధం అంటూ జరిగితే దాని తీవ్రత చాలా భయంకరంగా వుండే ప్రమాదం వుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతున్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
