1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Venezuela earthquake death toll rises to 2,295, over 11,000 injured

Venezuela earthquake: 2,295కి పెరిగిన వెనిజులా భూకంప మృతుల సంఖ్య

Venezuela earthquake
Venezuela earthquake
వెనిజులాలో జూన్ 24న సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మరణించిన వారి సంఖ్య 2,295కి పెరిగిందని, అలాగే గాయపడిన వారి సంఖ్య 11,267కి చేరిందని వెనిజులా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెజ్ తెలిపారు.
 
 గత వారం దేశాన్ని కుదిపేసిన భూకంపాల అనంతరం, బుధవారం దేశ పరిస్థితిపై తాజా వివరాలను వెల్లడిస్తూ రోడ్రిగెజ్ మాట్లాడుతూ, "నేటి వరకు 2,295 మంది మరణించారు. 11,267 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 12,841 మంది బాధితులు ఉన్నట్లు మేము గుర్తిస్తున్నాము" అని పేర్కొన్నారు. 
 
4,000 మందికి పైగా అంతర్జాతీయ, దేశీయ సహాయక సిబ్బంది, వాలంటీర్ల ద్వారా 6,461 మందిని రక్షించినట్లు ఆయన చెప్పినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
 
తాత్కాలిక శిబిరాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్‌కు కూడా అధిపతిగా ఉన్న రోడ్రిగ్జ్, భూకంపాల వల్ల తలెత్తిన గృహ సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాట్రియా ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
 
లా గువైరాలో 13, కారకాస్‌లో ఎనిమిది, మిరాండాలో రెండు, కారాబోబోలో ఒకటి, యారాకుయ్‌లో ఒకటితో సహా మొత్తం 25 తాత్కాలిక శిబిరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. శిబిరాలకు అవసరమైన పరికరాలను సమకూర్చడానికి, ప్రభావిత ప్రజలను అక్కడికి తరలించడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని రోడ్రిగ్జ్ తెలిపారు.
 
జూన్ 24 నుండి వెనిజులాలో 782 భూకంప అనంతర ప్రకంపనలు నమోదయ్యాయని, అయితే వాటి సంఖ్య తీవ్రత తగ్గాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, జూన్ 24న దేశాన్ని తాకిన శక్తివంతమైన భూకంపాల బాధితుల స్మృతికి నివాళిగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఏడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
50 కిలోల కల్తీ... మేక మాంసంలో గోమాంసం కలిపారు..