గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (09:12 IST)

సోషల్ మీడియాలో హీరో కావాలనుకుని చిల్లీసాస్ గుట గుట తాగేశాడు..

సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే ప్రభావం చూపుతోంది. సృజనాత్మకతను వెలికితీసేందుకు సోషల్ మీడియా బాగానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. కానీ కొందరు మాత్రం విచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు

సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే ప్రభావం చూపుతోంది. సృజనాత్మకతను వెలికితీసేందుకు సోషల్ మీడియా బాగానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. కానీ కొందరు మాత్రం విచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ తాజాగా ఓ వ్యక్తి బిజినెస్ పరంగా పాపులర్ అయ్యేందుకు యూట్యూబ్‌ను ఉపయోగించుకున్నాడు. ఇంకా యూట్యూబ్ హీరో కావాలనుకున్నాడు. అయితే అదికాస్తా వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని బార్బెక్యూ షాపు యజమాని అయిన ఓ యువకుడు తన బిజినెస్‌ను మరింత పెంచుకోవాలనుకున్నాడు. వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ యూట్యూబ్‌లో ఫేమస్ కావాలనుకున్నాడు. ఇందుకోసం వేడి వేడి చిల్లీసాస్ గుట గుట తాగేశాడు. అయితే అదికాస్త వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. గ్లాసు సాస్ తాగిన అతడు ఆ తర్వాత బాధతో కుప్పకూలిపోయాడు. 
 
ఆస్పత్రిలో చేరి రెండు వారాల చికిత్స తర్వాత బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. కొందరు నెటిజన్లు అతడిని చూసి అయ్యో అంటుంటే.. కొందరు మాత్రం ఇలాంటి పచ్చిపనులు మానుకోమని కామెంట్ చేస్తున్నారు.