తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఐదు తలల నాగుపాము ఓ కెమరామెన్ కంటికి చిక్కింది. కడంబూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న దశరథన్.. అడవుల్లోని చిన్నాలాట్టి ప్రాంతానికి ఫోటోల కోసం తన స్నేహితునితో బైక్లో బయలుదేరాడు. అటవీ అందాలను తన కెమెరాలో బంధించిన దశరథన్.. కడంబూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. తన స్నేహితునితో కలిసి మోటార్ బైక్పై ఇంటికి బయలుదేరాడు. కోట్టక్కాడు ప్రాంతాన్ని సమీపిస్తుండగా, రోడ్డు పక్కన ఓ పాము ఉండటాన్ని గమనించారు. పామును చూసి జడిసిన దశరథన్ బైక్ను వెంటనే ఆపేశాడు. బైక్ శబ్దానికి రోడ్డుపై ఉన్న పాము పడగ విప్పగా, అది ఐదు తలల నాగుపాముగా గుర్తించారు.