శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జూన్ 2017 (11:26 IST)

200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న ఫేస్ బుక్.. 2012 ఆ రికార్డు బద్ధలు..

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వ

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో తాము ఎల్లప్పుడూ ప్రగతి సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఫలితంగా యూజర్లు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నారని, వారితో తమ జర్నీ కొనసాగుతుందని జుకర్ బర్గ్ తన పోస్టులో రాశారు. కాగా 200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని  జుకర్ బర్గ్ వెల్లడించింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది. 
 
మార్చి 31 వరకు ఫేస్ బుక్‌కు 1.94 బిలియన్ యూజర్లున్నారు. గతేడాది కంటే ఇది 17 శాతం ఎక్కువ. 2012లో అక్టోబర్‌లో తొలిసారి ఫేస్ బుక్ 100 కోట్ల మైలురాయిని చేధించింది. ప్రస్తుతం మరో కొత్త మైలురాయి 200 కోట్లను ఫేస్ బుక్ అధిగమించింది.