ఆటోమేషన్ విధానంతో వచ్చే ఐదేళ్ళలో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులకు ఎసరు!
వచ్చే ఐదేళ్ళ (2021 నాటికి)లో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులను ఆయా కంపెనీలు కొలువుల నుంచి తొలగించనున్నాయి. ఈ మేరకు హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఓ సర్వేలో వెల్లడించింది. ఈ కొలువుల తొలగింపు కూడా ఎక్కడో కాదు..
వచ్చే ఐదేళ్ళ (2021 నాటికి)లో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులను ఆయా కంపెనీలు కొలువుల నుంచి తొలగించనున్నాయి. ఈ మేరకు హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఓ సర్వేలో వెల్లడించింది. ఈ కొలువుల తొలగింపు కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆటోమిషన్ విధానమే.
ఫలితంగా రాబోయే ఐదేళ్లలో భారత ఐటీ రంగంలో ఆరున్నర లక్షల ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించే అవకాశం ఉందని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ విశ్లేషించింది. దానికితోడు ఆటోమేషన్ విస్తరణ బిపీఓ పరిశ్రమల్లో గుబులు రేపుతోంది. ఐటి పరిశ్రమలోని 1477 స్టాక్ హోల్డర్స్ను కలిసి హెచ్ఎఫ్ఎస్ ఈ సర్వే నిర్వహించింది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఐటి పరిశ్రమలో నికరంగా 9 శాతం లేదా 14 లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని హెచ్ఎఫ్ఎస్ హెచ్చరించింది. ఈ పరిస్థితి ఫిలిప్పీన్స్, యూకే, అమెరికా వంటి అనేక దేశాల్లోనూ ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదని తేలిపోయింది. టెక్ మహింద్రా గతేడాది ప్రారంభించిన ఆటోమేషన్ డ్రైవ్లో భాగంగా… రెండు వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఇకపై అసెంచర్ సంస్థ తక్కువమంది ఉద్యోగులను తీసుకోనుందని ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. టీసీఎస్ కొత్తగా తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య కూడా అదే విషయం వెల్లడిస్తోంది. అలాగే, ఆటోమేషన్పై ఐటి ఉద్యోగుల్లో భయాలు మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తం దేశ ఆటోమేషన్ విధానం ఐటీ పరిశ్రమకే ఇది పెద్ద సవాల్గా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.