తెలంగాణ తెరపైకి మరో కొత్త వాదన దూసుకొచ్చింది. తాజాగా కేసీఆర్ 2014 ఎన్నికల మాట చెప్పడంతోపాటు ఇంతవరకూ జగన్ పార్టీని పల్లెత్తు మాట అనని కేసీఆర్ ఆ పార్టీని భూస్థాపితం చేయాలనడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటు కోసం తనను ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనీ, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టే పనిలోనే నిమగ్నమవుతానని కేసీఆర్ చెపుతున్నారు.