వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారంనాడు సీమాంధ్రలో సీఎంగా 4 ఫైళ్లపై సంతకాలు చేస్తానని చెప్పారు. బుధవారంనాడు ఖమ్మంలో జరిగిన జనభేరిలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ తరపున తొలి లోక్సభ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఇక్కడ నుంచి వైకాపా తరపున శ్రీనును గెలిపిస్తే కేంద్ర మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు.