కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రభుత్వాలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టంతో నిర్మించిన అధికార సౌథాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టంపై రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే నేతకు వ్యతిరేకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.