ప్రియతమా!ఏమని పిలువను...మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..నేనున్నానంటూ పలకరించావునీకు నువ్వు నాకు నేను అంటూ మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..ప్రపంచం సాక్షిగా..మనం నడకను కొనసాగిద్దామంటూ...మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...నువ్వొచ్చావు.ఆశాజీవన లతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..సెలయేటి పాటలా నువ్వొచ్చావు.. నువ్వూ నేనూ లేని జీవితం..నీకూ నాకూ లేని జీవితం..జీవితం కాదంటూ నువ్వొచ్చావు...సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...ఎందుకు జీవించలేమంటూ... ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...నువ్వొచ్చావు..