1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. A Employee stole 8.70 crore with the trash in Bank of Baroda

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

Bank of baroda
Bank of baroda
అహ్మదాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ నుంచి ఏకంగా రూ.8.70 కోట్లు మాయమయ్యాయి. కంచె చేను మేసిన చందంగా.. గత 15 ఏళ్లుగా అదే బ్యాంకులో జాయింట్ కస్టోడియన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి హర్సిద్ధ్ కడియార్ ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
 
సీసీటీవీ ఆధారంగా ఈ భారీ దోపిడి బయటపడింది. లక్కీ భాస్కర్ తరహాలో పక్కాగా ప్లాన్ చేసి బ్యాంకులో ఉన్న పాత చెత్తను బయట పడేయడానికి వెళ్తున్నానని చెప్పి.. ఒక పెద్ద అట్టపెట్టెను తీసుకుని బయటకు వచ్చాడు. కానీ ఆ బాక్సులో చెత్తకు బదులు ఏకంగా రూ.8.70 కోట్ల కరెన్సీని నింపాడు. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కరెన్సీ చెస్ట్ నుంచి ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఆ క్యాష్ బాక్సుతో దర్జాగా బయటకు తీసుకొచ్చాడు. సీసీటీవీ రికార్డులోని దృశ్యాలు చెరిగిపోతాయని అనుకుని.. మూడు నెలల పాటు ఆ బ్యాంకులోనే పనిచేశాడు. పోలీసులు ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్‌ను రికవర్ చేశారు. ఆ ఫుటేజ్ ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?