ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 మార్చి 2026 (15:10 IST)

Air India, ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం (video)

Air India flight narrowly escaped
ఎయిరిండియా విమానం తృటిలో పెను ప్రమాదనం నుంచి తప్పించుకున్నది. అందులో ప్రయాణిస్తున్న 133 మంది సురక్షితంగా బైటపడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ నుంచి థాయిలాండుకి ఎయిర్ ఇండియా విమానం బైలుదేరింది. ఈ క్రమంలో పుకెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది. దీనితో అత్యంత ప్రమాదకర రీతిలో క్రాష్ ల్యాండ్ అవుతూ కొంతదూరం వెళ్లి ఆగింది.
 
ఆ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణిస్తున్నారు. విమానం క్రాష్ ల్యాండ్ అవుతుండటంతో అందులోని వారంతా అరచేతుల్లో ప్రాణాలుపెట్టుకున్నారు. విమానం కొద్దిదూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.