బెంగళూరులో వివాహితపై గ్యాంగ్ రేప్.. చున్నీతోనే గొంతు బిగించి హత్య..
మహిళలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరువక మునుపే మహిళలపై అలాంటి దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దీంతో సభ్య సమాజంలో మహిళలకు ఆనందం, సంతోషం లేదు ఎప్పుడూ భయంతోనే గ
మహిళలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరువక మునుపే మహిళలపై అలాంటి దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దీంతో సభ్య సమాజంలో మహిళలకు ఆనందం, సంతోషం లేదు ఎప్పుడూ భయంతోనే గడుపుతున్నారు.
ఒంటరిగా వెళ్ళాలంటేనే జడుసుకుంటున్నారు. తాజాగా బెంగళూరు నగర శివారులోని నెలమంగలలో 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్రేప్కు పాల్పడిన దుండగులు దారుణ హత్య చేశారు. మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణం వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వయస్సు కల్గిన యువతి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. కాలికి మెట్టెలు ఉండటంతో ఆమెను వివాహితగా భావిస్తున్నారు.
గురువారం రాత్రి కారులో సదరు యువతిని నెలమంగలవైపు నుంచి తొండేకొప్ప రోడ్డు మార్గాన తీసుకు వచ్చి వెంకటాపురానికి వంద మీటర్లదూరంలో అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆమె ధరించిన చున్నీతోనే గొంతు బిగించి హత్యచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.