1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Beauty Parlour Owner Assaulted by Staff for Mixing Drugs in Water

తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగికదాడి.. (వీడియో)

Beauty Parlour Owner
రాజస్థాన్ రాష్ట్రంలో చురు జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్‌ యజమానిని భవానీ శంకర్ తాము తాగే నీటిలో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడే ఓ కామాంధుడు నిజ స్వరూపం బహిర్గతమైంది. ఆ కామాంధుడు చురు జిల్లాలో బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. పేరు భవానీ శంకర్. తన పార్లర్‌కు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై లైంగికదాడికి పాల్పడేవాడు. ఇందుకోసం తాగే నీటిలో మత్తుమందు కలిపేవాడు. ఆ నీటిని తాగిన మహిళలు మత్తులోకి జారుకోగానే వారిపై లైంగికదాడికి పాల్పడేవాడు. 
 
ఈ విషయాన్ని గుర్తుపట్టిన నలుగురు మహిళా ఉద్యోగులు భవానీ శంకర్‌ను నిలదీశారు. రహస్య కెమెరా ద్వారా అతడు నీళ్లలో మత్తు బిళ్లలు కలుపుతున్న దృశ్యాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు అతడిని గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి