శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (14:05 IST)

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో పడిన బస్సు: 35 మంది మృతి

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో బస్సు పడిపోయిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ బస్సులో 65 మంది ప్రయాణీకులున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో బస్సు పడిపోయిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ బస్సులో 65 మంది ప్రయాణీకులున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
కొంతమందికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారని వారు చెప్తున్నారు. మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని.. చెరువులో పడ్డ బస్సును బయటకు తీసేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
 
ఇకపోతే.. ఈ బస్సు ప్రమాదంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతులకు సంతాపం ప్రకటించిన సీఎం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.